టీడీపీ సాంగ్‌పై ఈసీకి ఫిర్యాదు

by Disha Web Desk 16 |
టీడీపీ సాంగ్‌పై ఈసీకి ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సాంగ్‌పై ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాను కలిశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, షర్మిలపై సైతం ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చర్యలు తీసుకోవాలని కోరారు.


ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు, పవన్, షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 100 చోట్ల సమస్యాత్మక బూత్‌లున్నాయని, అక్కడ ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. పవన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మల్లాడి విష్ణు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed